మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ తయారు చేసిన తన వాక్స్ స్టాచ్యు ని ఆవిష్కరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు



హైదరాబాద్, ఇండియా - Media OutReach - 26 మార్చి 2019 - సూపర్ స్టార్ మహేష్ బాబు మేడం టుస్సాడ్స్ సింగపూర్ తయారు చేసిన ప్రపంచంలో తన తొలి, ఏకైక మైనపు బొమ్మని హైదరాబాద్ లోని .ఎం.బి సినిమాస్ లో ఆవిష్కరించారు. కుటుంబసభ్యులు, ప్రముఖులు, సింగపూర్ టూరిజం బోర్డు ప్రతినిధుల సమక్షంలో  300 మందికి పైగా అతిధులు హాజరైన వేడుకలో మహేష్ తన వాక్స్ స్టాచ్యు ని ఆవిష్కరించారు. 200 మందికి పైగా అభిమానులు తమ అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్ ని  పోలి ఉన్న మైనపు బొమ్మతో సెల్ఫీలు తీసుకున్నారు. మహేష్ వాక్స్ స్టాచ్యు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇతర ప్రముఖుల విగ్రహాలతో పాటు సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో కనువిందు చేయనుంది.




 

సందర్భంగా సూపర్ స్టార్ మహేష్, " అభిమానుల సమక్షంలో నా వాక్స్ స్టాచ్యు ని ఆవిష్కరించడం, వారు సెల్ఫీలు తీసుకుంటూ తమ సంతోషాన్ని పంచుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో వాక్స్ స్టాచ్యు ఉండబోతోంది. ఇలా వాళ్ళ ఆనందంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది." అన్నారు.

 

తన భర్త మహేష్ వాక్స్ స్టాచ్యు ని లాంచ్ చేసిన సందర్భంలో, నమ్రత శిరోద్కర్, " ఇప్పుడు నాకు భర్తలుగా ఇద్దరు అందమైన మహేష్ లు ఉన్నారు" అని సరదాగా అన్నారు.  

 

మేడం టుస్సాడ్స్ సింగపూర్ జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ, " రోజు మేము తొలిసారిగా ఒక ప్రముఖుని వాక్స్ స్టాచ్యు ని సింగపూర్ లో కాకుండా బయట ఆవిష్కరించాం . మహేష్ బాబు తో కలిసి ఈవెంట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.  మహేష్ లాంటి సూపర్ స్టార్ వాక్స్ స్టాచ్యు ని తయారు చేయడం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం. ఇండియా నుండి వచ్చే టూరిస్టులు మా మేడమ్ టుస్సౌడ్స్ కి తప్పనిసరిగా వస్తుంటారు. భారతీయ సినిమా సెలబ్రిటీ లను వారికి అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం." అన్నారు

 

కార్యక్రమానికి సింగపూర్ టూరిజం బోర్డు తరఫునుంచి హాజరైన అడ్రియన్ కాంగ్ మాట్లాడుతూ, " 1960 నుంచి భారతీయ చిత్రాలు సింగపూర్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ లో భారతీయ సినీ ప్రముఖుల వాక్స్ స్టాచ్యు లని తయారు చేసి ప్రదర్శనగా ఉంచడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఇండియా నుండి సింగపూర్ వచ్చే సందర్శకులకు మేడమ్ టుస్సాడ్స్ ఎంతో ఇష్టమైన పర్యాటక కేంద్రం. ఇప్పుడు అక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టాచ్యు కూడా తోడవడంతో ఇక్కడి నుండి వచ్చే సందర్శకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వచ్చే టూరిస్టులకు ఇది ప్రత్యేక ఆకర్షణ అవుతుంది."

 

తెలుగు సినిమాలో తన నటన, చిత్రాలతో అత్యంత పాపులర్ హీరోల్లో ఒకరైన మహేష్ ది భారతీయ చిత్రపరిశ్రమలోనే ప్రత్యేక స్థానం. మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ లో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (IIFA) ఇతర భారతీయ సినీ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్, కరీనా కపూర్, అనుష్క శర్మ తో పాటూ మహేష్ వాక్స్ స్టాచ్యు కూడా సందడి చేయనుంది.

 

వేడుకలో మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ వారు త్వరలో  తాము  ప్రారంభించనున్న కొత్త జోన్ గురించి కూడా తెలియజేసారు. 'అల్టిమేట్ ఫిలిం స్టార్ ఎక్స్పీరియన్స్' పేరిట ఏర్పాటు చేయనున్న జోన్ లో టూరిస్ట్ లు ఇంటరాక్టివ్ టెక్నాలజీ సహాయంతో తమ అభిమాన తారల తో కలిసిన అనుభూతి పొందొచ్చు.



The issuer is solely responsible for the content of this announcement.
మేడమ్ టుస్సాడ్స్ గురించి :
మేడమ్ టుస్సాడ్స్ గురించి :

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ ని ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా టూరిస్టులు సందర్శిస్తుంటారు. వారందరికీ అక్కడ టాప్ సెలబ్రిటీలను పోలి ఉండేలా తయారు చేసిన వాక్స్ స్టాచ్యు లతో టూరిస్ట్ లకు తమ అభిమాన తారలని కలిసిన అనుభవాన్ని అందిస్తుంది.

 

లండన్ లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా, న్యూ యార్క్, షాంఘై, ఆమ్స్టర్డామ్, సిడ్నీ వంటి 23 చోట్ల మేడమ్ టుస్సాడ్స్ విస్తరించి ఉంది. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన మేడమ్ టుస్సాడ్స్ వేలాదిమంది  ప్రముఖుల వాక్స్ స్టాచ్యు లను తయారు చేసి ప్రదర్శనగా ఉంచుతోంది. సందర్శకులకు వారి అభిమాన తారలతో కలిసి ఫోటోలు తీసుకునే అవకాశం కల్పిస్తోంది.

 

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తారలోకంలో మీరూ ఒక తారగా వెలిగేందుకు మేడమ్ టుస్సాడ్స్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు సహజంగా ఉండే సెట్లు, వాతావరణాన్ని సృష్టించడంతో పాటు అత్యాధునిక టెక్నాలజీ తో మరపురాని అనుభవాన్ని అందించడానికి మేడమ్ టుస్సాడ్స్ సిద్ధంగా ఉంది.

SOURCE:

Madame Tussauds Singapore

CATEGORY:

Lifestyle

READ IN:

English

PUBLISHED ON:

26 Mar 2019

Past Press Releases

MORE

Talk to Media OutReach Newswire today

CONTACT US NOW